Latest Post

ఒక్క అమ్మాయి తప్ప సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సందీప్ కిషన్, గ్యాప్ తీసుకోకుండా వెంటనే తన నెక్ట్స్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. తొలిసారిగా కృష్ణవంశీ లాంటి స్టార్ డైరెక్టర్ తో కలిసి నక్షత్రం సినిమాలో నటిస్తున్నాడు సందీప్. బుధవారం ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. తొలి రోజునే యాక్షన్ సీన్స్ షూటింగ్ ప్రారంభించగా.. షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో సందీప్ తలకు బలమైన గాయం తగలడంతో యూనిట్ సభ్యులు వెంటనే అతన్ని దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటన పై స్పందించిన హీరో సందీప్ కిషన్ 'ఇప్పుడు బాగానే ఉంది. కొన్ని కుట్లు పడ్డాయి. కృష్ణవంశీ గారి సెట్ లో యాక్షన్ సీన్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. కానీ సీన్ చాలా బాగా వచ్చినందకు ఆనందంగా ఉంది' అంటూ ట్వీట్ చేశాడు.

 
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తదుపరి హీరో ఎవరు? దిల్‌ రాజు, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో రూపొందే సినిమాలో నటించే గోల్డెన్ చాన్స్ ఎవరికి దక్కుతుంది? ప్రస్తుతం ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతోంది. 'అ.. ఆ' సినిమా విజయంతో మంచి ఊపుమీదున్న త్రివిక్రమ్ తన తదుపరి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్‌ను హీరోగా తీసుకోవచ్చన్నది టాలీవుడ్ టాక్. ఇప్పటికే పవన్ కల్యాణ్, మహేశ్ బాబులతో రెండేసి సార్లు పనిచేసిన ఈ స్టార్ డైరెక్టర్.. ఈసారి వాళ్లు కాక మరో కొత్త హీరోతో చేయాలని భావిస్తున్నాడట. అందుకే తాను ఇప్పటివరకు పనిచేయని చెర్రీ లేదా తారక్‌లలో ఎవరో ఒకరిని ఎంచుకోవాలని అనుకుంటున్నాడు. అయితే ఈ విషయమై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

రామ్‌చరణ్ ప్రస్తుతం తమిళంలో సూపర్ హిట్ అయిన తని ఒరువన్ సినిమా రీమేక్ 'ధ్రువ'లో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ మాత్రం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న జనతా గ్యారేజ్ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసేస్తున్నాడు. త్రివిక్రమ్ తన కొత్త సినిమా కథ చెప్పగానే ఎన్టీఆర్ బాగా థ్రిల్లైపోయి.. వెంటనే సరేనన్నాడని కూడా వినిపిస్తోంది. కొన్ని వారాల్లోనే హీరో ఎవరన్నది ఫైనలైజ్ అవుతుందని, ఇక వెంటనే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలవుతాయని త్రివిక్రమ్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.




Published on Jun 12, 2016
'దేవదాస్' చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమయ్యి ఆ తరువాత 'పోకిరి' చిత్రంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఇలియానా. ఆ తరువాత వరుసపెట్టి స్టార్ హీరోల పక్కన నటించడమే కాకుండా టాలీవుడ్ లో కోటి రూపాయలు పారితోషికం తీసుకున్న మొదటి హీరోయిన్ గా ఇలియానా రికార్డు సృష్టించింది. అయితే ఆ తరువాత బాలీవుడ్ లో అవకాశం రావడంతో అక్కడికి మఖాం మార్చేసింది. అయితే అక్కడ మంచి మంచి సినిమాలు చేసినా అమ్మడుకి సరైన అవకాశాలు రాలేదు. ఇదిలా ఉంటే ఈ అమ్మడు తాజాగా ఒక చారిటీ ఫంక్షన్ కి ముఖ్యఅతిధిగా వెళ్ళింది.

అయితే లోపలి వెళ్ళేటప్పుడు ఆమె షర్టు విప్పేసి నడుముకి కట్టుకుని వెళ్ళింది. ఇది చూసిన వారు ఇలియానా ని కళ్ళార్పకుండా చూసారు. ఆ డ్రెస్ లో ఇలియానా ఎంతో సెక్సీగా ఉంది. మొత్తం మీద తన మతిపోయే ఫిగర్ తో మరోసారి అందరినీ కట్టి పడేసింది. ఇలియానా ప్రస్తుతం అక్షయ్ కుమార్ సరసన 'రుస్తుం' అనే సినిమాలో నటిస్తుంది. ఇందులో టూ పీస్ బికినీ వేసి అందరినీ పిచ్చెక్కించబోతుంది. అంతే కాదు ఇందులో విపరీతమైన హాట్ హాట్ సన్నివేశాలు ఉన్నాయట. అవకాశాలు కోసం ఇలియానా ఇంక అందాల ఆరబోతకు మరింత రెచ్చిపోయి గేట్లు ఎత్తేసిందని బాలీవుడ్ టాక్..

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget